Chinese Premier : వయనాడ్ విషాదం.. భారత ప్రధానికి చైనా ప్రీమియర్ సంతాప సందేశం

దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది చనిపోయిన ఘటనపై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2024-08-04 13:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి వందలాది మంది చనిపోయిన ఘటనపై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈమేరకు ఓ సంతాప సందేశాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లీ కియాంగ్ శనివారం రోజు పంపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చైనా ప్రీమియర్ లీ కియాంగ్ భారత ప్రధానికి పంపిన సందేశం వివరాలను భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్ చేశారు. వయనాడ్ ఘటన గురించి తెలుసుకొని చైనా ప్రీమియర్ షాక్‌కు గురయ్యారని తెలిపారు.

Tags:    

Similar News