బెట్టింగ్ ప్రకటనలపై మీడియాకు కేంద్రం హెచ్చరిక!

ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌ ప్రకటనలను ప్రచురించడం, ప్రదర్శించడంపై మీడియా సంస్థలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

Update: 2023-08-25 13:54 GMT

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌ ప్రకటనలను ప్రచురించడం, ప్రదర్శించడంపై మీడియా సంస్థలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తప్పవని వార్తాపత్రికలు, టీవీ ఛానెల్స్, డిజిటల్ & సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌‌కు సూచించింది.

ఈ మేరకు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన ప్రకటనలు/ప్రమోషనల్ కంటెంట్‌ను ఏ రూపంలోనైనా ప్రదర్శించడాన్ని తక్షణమే మానుకోవాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వారిని కోరింది. ఈ ఆదేశాలు పాటించడంలో విఫలమైతే, ప్రభుత్వం వివిధ చట్టాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని జారీ చేసిన అడ్వైజరీ నోట్‌లో పేర్కొంది.


Similar News