గుజరాత్లో ఘోర బస్సు ప్రమాదం.. ఇద్దరు చిన్నారుల మృతి
పర్యాటక ప్రాంతమైన సపుతారాకు వెళ్లి సూరత్కు తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని డాంగ్లో బస్సు లోయలో పడిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. 65 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సపుతారాకు వెళ్లి సూరత్కు తిరిగి వస్తున్న సమయంలో ఆదివారం సాయంత్రం ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిపై వెళ్తున్నప్పుడు బస్సు మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ప్రమాదవశాత్తు రక్షణ గోడను ఢీకొని బోల్తా పడటంతో ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసు అధికారులు, 108 బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించే చర్యలు చేపట్టారు. వారిలో ముగ్గురు దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మిగిలినవారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్టు అధికారులు మీడియాకు వెల్లడించారు.