Manipur : మణిపూర్లో బీజేపీ నేత ఇంటికి నిప్పు.. అల్లరిమూకల అరాచకం
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లా పెనియెల్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి తెగబడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లా పెనియెల్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి తెగబడ్డారు. రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి మైఖేల్ లమ్జాథాంగ్ హాకిప్ తల్లిదండ్రుల ఇంటికి నిప్పుపెట్టారు. అక్కడ పార్క్ చేసి ఉన్న ఫోర్ వీలర్కు కూడా నిప్పంటించారు. ఈ ఘటనలో దాదాపు 20 మందికిపైగా అల్లరిమూకలు పాల్గొన్నారని గుర్తించారు. గత ఏడాది వ్యవధిలో లమ్జాథాంగ్ హాకిప్ తల్లిదండ్రుల ఇంటిపై దాడి జరగడం ఇది మూడోసారి.
వారం క్రితమే ఈ ఇంటిపై కొందరు అల్లరిమూకలు దాడి చేశారు. దాన్ని మరువక ముందే ఇప్పుడు మరోసారి ఎటాక్ జరగడం గమనార్హం. ఈ ఘటనపై దర్యాప్తు చేసి, సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని జిల్లా డిప్యూటీ కమిషనర్ ధరుణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ దాడిని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ ఖండించారు.