Brij Bhushan : మొన్న కంగన.. ఇప్పుడు బ్రిజ్ భూషణ్.. బీజేపీ హైకమాండ్ హితవు

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హైఅలర్ట్ మోడ్‌లో ఉంది.

Update: 2024-09-08 12:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హైఅలర్ట్ మోడ్‌లో ఉంది. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడొద్దంటూ ఇటీవలే పార్టీ ఎంపీ కంగనా రనౌత్‌కు బీజేపీ హైకమాండ్ హితవు పలికింది. తాజాగా ఇప్పుడు మాజీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు కూడా పార్టీ పెద్దలు కీలక నిర్దేశం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే చేరిన రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజ్రంగ్ పునియాలపై విమర్శలు చేయొద్దని ఆయనకు హైకమాండ్ సూచించిందని సమాచారం.

విమర్శలు చేయడం వల్ల హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్, బజ్రంగ్‌లకు రాజకీయ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. హర్యానా ఎన్నికల్లో లబ్ధి కోసం బ్రిజ్ భూషణ్ కామెంట్స్‌ను కాంగ్రెస్ వాడుకునే అవకాశం ఉందని, హస్తం పార్టీకి ఆ అవకాశం ఇవ్వకూడదంటే విమర్శలకు దూరంగా ఉండటమే బెటర్ అనే భావనలో బీజేపీ హైకమాండ్ ఉందని అంటున్నారు.


Similar News