Baba Siddique : బాబా సిద్దిఖీ హత్యకేసు.. మరో ఐదుగురు అరెస్ట్

దిశ, నేషనల్ బ్యూరో : ముంబైలో ఇటీవలే జరిగిన ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గం నేత బాబా సిద్దిఖీ (66) హత్య కేసు దర్యాప్తులో కీలక పురోగతి చోటుచేసుకుంది.

Update: 2024-10-18 18:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ముంబైలో ఇటీవలే జరిగిన ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గం నేత బాబా సిద్దిఖీ (66) హత్య కేసు దర్యాప్తులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరో ఐదుగురు అనుమానితులను శుక్రవారం అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి పెరిగింది.

తాజాగా అరెస్టు చేసిన ఐదుగురిని ముంబైలోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపర్చగా.. ఈనెల 25 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముంబైలోని కర్జత్, దోంబీవాలీ, నవీ ముంబై ఏరియాల్లో పలుచోట్ల పోలీసులు ముమ్మర సోదాలు నిర్వహించి వీరిని అరెస్టు చేశారు. ఈ ఐదుగురు నిందితులు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌తో టచ్‌లో ఉన్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. 


Similar News