Assam : పాఠశాల విద్యాబోర్డులను విలీనం చేసిన అసోం సర్కారు

దిశ, నేషనల్ బ్యూరో : అసోం సీఎం హిమంత బిస్వ శర్మ ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-09-08 19:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అసోం సీఎం హిమంత బిస్వ శర్మ ఆదివారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పాఠశాల విద్యాబోర్డు(SEBA), హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్‌ (AHSEC)లను విలీనం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ రెండింటిని కలిపి ‘‘అస్సాం స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు’’ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ-2020 ప్రకారం దీన్ని నిర్వహిస్తామని సీఎం హిమంత చెప్పారు. 21వ శతాబ్దపు అవసరాలను తీర్చేలా కొత్త బోర్డు పనితీరు ఉంటుందన్నారు. కొత్తగా ఏర్పాటైన ‘‘అస్సాం స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు’’కు ఛైర్మన్‌గా ఆర్.సి.జైన్‌, వైస్ ఛైర్మన్‌గా రుక్మా గొహైన్ బారువాలను నామినేట్ చేస్తున్నట్లు గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య చెప్పారు. వారిని మూడేళ్ల కాలం (70 ఏళ్ల వయసు వరకు) కోసం ఈ పదవుల్లో నియమిస్తున్నట్లు తెలిపారు.


Similar News