సీఎం కేజ్రీవాల్‌కు మూడు రోజుల సీబీఐ కస్టడీ

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌కు రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Update: 2024-06-26 13:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌కు రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్‌ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆయనను తిరిగి జూన్ 29న(శనివారం) రాత్రి 7 గంటలలోగా కోర్టు ఎదుట హాజరుపర్చాలని రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జి అమితాబ్ రావత్ ఆదేశించారు.అంతకుముందు వాదనలు వినిపించిన సీబీఐ తరఫు న్యాయవాది .. తమకు కేజ్రీవాల్‌ను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. అయితే మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.


Similar News