AIADMK: అన్నాడీఎంకే కార్యకర్త దారుణ హత్య

తమిళనాడులోని కడలూరులో ఏఐడీఎంకే కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడ్ని తిరుపాప్లియూర్ కు చెందిన పద్మనాభన్ గా గుర్తించారు.

Update: 2024-07-28 10:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులోని కడలూరులో ఏఐడీఎంకే కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడ్ని తిరుపాప్లియూర్ కు చెందిన పద్మనాభన్ గా గుర్తించారు. పద్మనాభన్ బాగూర్ వైపునకు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించారు. ఆ ముఠా సభ్యులు వాహనంలో పద్మనాభన్ బైక్ ను కిలోమీటర్ల మేర వెంబడించారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ని ఢీకొట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే.. పద్మనాభన్ మృతు చెందారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Similar News