ఆప్ కొత్త ప్రచారం.. "కేజ్రీవాల్ ఆయేంగే"

ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ప్రచారానికి తెరలేపింది.

Update: 2024-08-22 16:50 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ప్రచారానికి తెరలేపింది. 'కేజ్రీవాల్ ఆయేంగే' అనే స్లోగన్ తో వినూత్న ప్రచారాన్ని ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉన్నారు. ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 17 నెలల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. కేజ్రీవాల్ కూడా త్వరలోనే బయటికి వస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఈ ప్రచారాన్ని మొదలు పెట్టారు. అక్టోబరులో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అని స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. హర్యానాలో తామే గెలుస్తామని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఆప్ ఇప్పటినుండే వినూత్న ప్రచారాన్ని సాగిస్తోంది. ఇక బెయిల్ నుండి బయటకు వచ్చిన మనీష్ సిసోడియా పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు.


Similar News