చెన్నై శివారులో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన కార్మికులు

తమిళనాడు రాజధాని చెన్నై శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెయింట్ తయారీ కంపెనీలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

Update: 2024-07-26 16:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నై శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెయింట్ తయారీ కంపెనీలో శుక్రవారం రాత్రి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్ని జ్వాలలు ఎగిసిపడటంతో తీవ్ర భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. స్థానికులు, కంపెనీ వర్కర్ల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఏడు ఫైరింజన్ల సహయంతో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ప్రాణనష్టం జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News