అమెరికా మహిళ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. ఇంతకీ గొలుసులతో బంధించింది ఎవరంటే..?

ఇటీవల మహారాష్ట్ర అడవుల్లో 40 రోజులపాటు గొలుసులతో బంధించబడి, దీనస్థితిలో దొరికిన అమెరికా మహిళ లలితా కయీ విషయంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది.

Update: 2024-08-05 15:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల మహారాష్ట్ర అడవుల్లో 40 రోజులపాటు గొలుసులతో బంధించబడి, దీనస్థితిలో దొరికిన అమెరికా మహిళ లలితా కయీ విషయంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆమెను రక్షించి, ఆసుపత్రిలో చేర్చి రక్షించిన పోలీసులు.. తన భర్త గొలుసులతో బంధించి అడవిలో విడిచి పెట్టడాని, 40 రోజులు తిండిలేక అల్లాడిపోయాయని ఆ మహిళ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఆమె భర్తపై కేసు నమోదు చేసి, ఆమెకు చికిత్స అందించారు. ఆమె వద్ద లభించిన పత్రాలను బట్టి గత పదేళ్లుగా భారత్ లోనే నివాసం ఉంటున్నట్టు తెలుసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఆమెకు మతిస్థిమితం లేదని, తనను తానే గొలుసులతో బంధించుకుందని, అసలు ఆమెకు భర్తనే లేడని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం రత్నగిరిలోని ఓ మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న లలితా కయీ ఆరోగ్యం బాగవుతున్న కొద్దీ తన వివరాలు చెబుతోందని పోలీసులు మీడియాకు వివరించారు. 


Similar News