Bihar: బిహార్ లో దుర్గా పూజా మండపం దగ్గర కాల్పుల కలకలం
బిహార్ లో దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు కలకలం రేపాయి. బైక్లపై వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ లో దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు కలకలం రేపాయి. బైక్లపై వచ్చిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. భోజ్ పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆదివారం తెల్లవారుజామున అర్హాలోని దుర్గా పూజా పండల్ వద్దకు గుర్తుతెలియని వ్యక్తులు రెండు బైకులపై వచ్చారు. అక్కడున్న వారిపై గన్స్తో కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మండపం వద్దకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పుల్లో గాయపడిన వారిని అర్మాన్ అన్సారీ(19), సునీల్ కుమార్ యాదవ్(26), రోషన్ కుమార్(25), సిపాహి కుమార్(23)గా గుర్తించారు. అర్మాన్ వీపు, సునీల్ ఎడమ చేయి, రోషన్ కుడి మోకాలి కింద, సిపాహి నడుముపై కాల్పుల గాయాలయ్యాయి. వీరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బుల్లెట్ కాట్రిడ్జ్ లు స్వాధీనం
మరోవైపు, ఘటనాస్థలి నుంచి రెండు బుల్లెట్ కాట్రిడ్జ్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు జరుపుతామన్నారు. దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు ఎవరు, ఎందుకు జరిపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.