టీమ్ ఇండియాలో సెక్స్ స్కాండల్ కలకలం.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అత్యాచారం ఆరోపణలు..

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా క్రికెటర్లపై అత్యాచార ఆరోపణలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. భారత జట్టులోని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ తనను అత్యాచారం చేశారంటూ ఒక మహిళ ముంబైలోని శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా ఆ ఫిర్యాదులో మాజీ బీసీసీఐ అధ్యక్షుడు రాజీవ్ శుక్లపై కూడా ఆరోపణలు చేసింది. సెప్టెంబర్ 24నే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. తాజాగా సమీత్ ఠక్కర్ అనే […]

Update: 2021-11-12 09:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా క్రికెటర్లపై అత్యాచార ఆరోపణలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. భారత జట్టులోని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ తనను అత్యాచారం చేశారంటూ ఒక మహిళ ముంబైలోని శాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా ఆ ఫిర్యాదులో మాజీ బీసీసీఐ అధ్యక్షుడు రాజీవ్ శుక్లపై కూడా ఆరోపణలు చేసింది. సెప్టెంబర్ 24నే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినా.. తాజాగా సమీత్ ఠక్కర్ అనే వ్యక్తి ఆ కంప్లైట్ కాపీని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు దగ్గరి అనుచరుడైన రియాజ్ భాటి భార్య రెహనుమా ఈ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తన భర్తే దీనికి మూల కారణం అంటూ రెహనుమా ఆ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.

రెహనుమా ఇచ్చిన ఫిర్యాదులో పలు సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త రియాజ్ భాటి తనను బలబంతంగా కొంత మంది హైప్రొఫైల్ సెలెబ్రిటిలతో శృంగారం జరపడానికి బలవంతం చేశాడని ఆమె చెప్పింది. తనపై టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మాజీ పేసర్ మునాఫ్ పటేల్, బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తనపై అత్యాచారం చేశారని ఆ ఫిర్యాదులో ఉన్నది. ముంబైలోని కాంటినెంటల్ హోటల్‌లో మునాఫ్ పటేల్‌తో.. ట్రైడెంట్ హోటల్‌లో హార్దిక్ పాండ్యాతో సెక్స్ చేయమని తనను బలవంతం చేశారని రెహనుమా పేర్కొన్నది. హార్దిక్ పాండ్యా తన ఇద్దరు స్నేహితులతో కలసి తనపై అసహజమైన శృంగారం చేశారని.. ఆ సమయంలో వాళ్లందరూ మద్యం సేవించి ఉన్నారని ఆమె ఆరోపించింది.

చిన్నతనంలోనే తన తల్లిని బెదిరించి తనను వివాహం చేసుకున్నాడని.. ఇప్పుడు తన వ్యాపార లావాదేవీల కోసం తనను వ్యభిచారం చేయమని బలవంత పెడుతున్నాడని రెహనుమా చెబుతున్నది. అతడు కూడా తనపై శారీరక, లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది. తనను బడా బాబుల దగ్గరకు వారి కోరికలు తీర్చేందుకు పంపేవాడని రెహనుమా చెప్పింది. ఇందుకు ఒప్పుకోకపోతే చిత్ర హింసలు పెట్టేవాడని పేర్కొన్నది.

కాగా, ఈ ఫిర్యాదు విషయమై ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మంజునాథ్ సింగ్‌ను సంప్రదించగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే అని చెప్పారు. కాగా, ఆమెపై జరిగిన అత్యాచారాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితి ఎలా ఉన్నదనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని.. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే రెహనుమా పేర్కొన్న చిరునామాలు, వ్యక్తుల వివరాలు తనకు తెలియదని మంజునాథ్ చెప్పారు.

పెళ్లికి ముందే శృంగారం చేస్తే తప్పేంటి? : హాట్ బ్యూటీ

Tags:    

Similar News