ఆ సినిమా చూస్తే 'రాజయోగయోగ'మే..!

ఇది డిసెంబర్ 30న థియేటర్స్‌లో రిలీజ్ అయింది

Update: 2023-01-02 06:27 GMT

దిశ, సినిమా : ప్రేక్షకులను ఆకట్టుకోవడానికో, పాపులారిటీ కోసమో కానీ అప్పుడప్పుడూ మూవీ మేకర్స్ తమ సినిమా చూస్తే గిఫ్టులు ఇస్తాం.. అని గానీ, హీరో హీరోయిన్లను కలిసే అవకాశం కల్పిస్తామని గానీ ప్రకటిస్తూ ఉంటారు. లక్కీ డ్రా ఆఫర్లు ప్రవేశ పెడుతుంటారు. తాజాగా అదే జరిగింది. తాము నిర్మించిన సినిమా చూస్తే రూ. 1 లక్ష బహుమతి అందజేస్తామని వెల్లడిస్తూ..ఓ కండిషన్ పెట్టింది రాజయోగం మూవీ యూనిట్. అదేమిటంటే..సాయి రోనక్ హీరోగా అంకిత సాహా, బిస్మి నాస్ హీరోయిన్స్‌గా, దర్శకుడు రామ్ గణపతి డైరెక్షన్‌లో రాజయోగం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇది డిసెంబర్ 30న థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఫుల్ కామెడీగా ఉండి..ప్రేక్షకులని అలరిస్తోందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ గణపతి మాట్లాడుతూ..''మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రేక్షకులే చెప్తున్నారు. చాలామంది ఈ చిత్రాన్ని అభినందిస్తున్నారు. ఆదరిస్తున్నారు కూడా. ఇంకా మూవీ చూడనివాళ్లు ఎవరైనా ఉంటే..థియటర్‌కి వెళ్లి చూసిరావాలని కోరుతున్నా. అలాగే ఈ మూవీ చూస్తున్నప్పుడు ఎవరైనా నవ్వకుండా ఉంటే వారికి గిఫ్ట్‌గా లక్ష రూపాయలు ఇస్తాం..అవి ఎవరు గెలుచుకుంటారో చూడాలి మరి'' అంటూ చెప్పుకొచ్చారు. 

Also Read: 

రామ్ హీరోగా బోయపాటి తీస్తున్న మూవీపై క్రేజీ రూమర్స్


Similar News