యావత్ దేశాన్ని కదిలించే కథతో రాబోతున్నాం.. ‘ది బెంగాల్ చాప్టర్’పై అంచనాలు పెంచుతున్న నిర్మాత కామెంట్స్

బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-03 09:10 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2022లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో ఒక్కసారిగా అగ్నిహోత్రి క్రేజ్ కూడా మరింత పెరిగింది. ప్రజెంట్ ఆయన ‘ది ఢిల్లీ ఫైల్స్’ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. దీనిని రెండు పార్టులుగా తీసుకురాబోతున్నారు. అయితే ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ నిర్మిస్తున్నారు. తాజాగా, ఢిల్లీ ఫైల్స్ పార్ట్-1 టైటిల్ విడుదల చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

ఈ చిత్రానికి ‘ది బెంగాళ్ ఛాప్టర్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ అభిషేక్ అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టారు. అయితే ఈ సినిమాను 2025లో ఆగస్టు 15న థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. దీనిపై అభిషేక్ మాట్లాడుతూ.. ‘‘ఎంతో కాలం పరిశోధన చేసిన తర్వాత కథలోని తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ది ఢిల్లీ ఫైల్స్‌ను రెండు భాగాలుగా తీసుకురావాలని నిర్ణయించుకున్నాము.

అమ్మవారి ఆశీస్సులతో, యావత్ దేశాన్ని కదిలించే కథను చెప్పడానికి మేము ఈ ప్రయాణాన్ని ప్రారంభించాము. ఫస్ట్ పార్ట్ ‘ది బెంగాల్ ఛాప్టర్’ పేరుతో వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ నిర్మాత కామెంట్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచడంతో పాటు పోస్టర్ అందరిలో ఆసక్తిని రెట్టింపు చేస్తుంది.


Similar News