ఓటుకు డబ్బులు తీసుకుంటా.. తప్పేముంది.. హీరో కామెంట్స్ వైరల్
హీరో విజయ్ ఆంటోనీ కూతురు మరణం తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోతున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తూ
దిశ, సినిమా : హీరో విజయ్ ఆంటోనీ కూతురు మరణం తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోతున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తూ నిర్మించిన ‘రోమియో’ మూవీ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. హీరోయిన్ మృణాళిని రవితో కలిసి ప్రెస్మీట్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఆయన.. హీరో విజయ్ పార్టీకి మద్దతిస్తానని ప్రకటించాడు. ఇక డబ్బులు తీసుకుని ఓటు వేయడంపై అభిప్రాయమేంటని ప్రశ్నించగా.. ఓటుకు నోటు ఇవ్వడం, తీసుకోవడం తప్పే కానీ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని అలా తీసుకోవచ్చని చెప్పాడు. అయితే మనీ అందాయని ఆ పార్టీకి ఓటు వేయకుండా మంచి లీడర్స్కు ఓటు వేస్తానని తెలిపాడు.
కాగా ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతున్న ‘రోమియో’కు వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించగా.. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పోరేషన్పై హీరో విజయ్ స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రం భార్యాభర్తల మధ్య బంధం ప్రత్యేకతను వివరిస్తుందని.. తమ వైఫ్ను తీసుకుని ప్రతి ఒక్కరు థియేటర్లో సినిమా చూడాలని కోరాడు.