BIGG BOSS SEASON- 8: బిగ్‌బాస్ సీజన్-8 లో ఊహించని కంటెస్టెంట్లు.. అమృతా ప్రణయ్‌తో సహా..?

హాలీవుడ్‌లో ప్రారంభమైన బిగ్‌బాస్ రియాల్టీ షో.. తర్వాత తెలుగు, హిందీ, కన్నడ వంటి భాషల్లో స్టార్టై సక్సెస్ అయ్యింది.

Update: 2024-07-07 08:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్‌లో ప్రారంభమైన బిగ్‌బాస్ రియాల్టీ షో.. తర్వాత తెలుగు, హిందీ, కన్నడ వంటి భాషల్లో స్టార్టై సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో ఆడియన్స్ నుంచైతే మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పటివరకు వచ్చిన సీజన్స్ అన్ని మంచి రేటింగ్‌తో దూసుకుపోయాయి. బిగ్ బాస్ సీజన్-1 లో విజేతగా ‘శివ బాలాజీ’ విన్నర్‌గా నిలిచారు. సీజన్‌-2 లో ‘కౌశల్’ గెలిచారు. మూడో సీజన్‌లో రాహూల్ సిప్లిగంజ్ విన్ అయ్యారు. సీజన్-4 లో విజేతగా అభిజీత్ గెలిచారు. ఐదో సీజన్‌లో సన్ని గెలిచారు. బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రేవంత్ విన్నర్‌గా నిలిచారు. ఇక సీజన్-7 లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచారు. ఇప్పుడు జనాలంతా బిగ్‌బాస్ సీజన్ 8 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

అయితే ఎనిమిదోవ సీజన్‌లో నాగార్జున సీరియల్ నటీనటులు, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్ ను కంటెస్టెంట్లుగా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. వారి పేర్లు లీక్ కాకుండా నాగార్జున ఎంతో ప్రయత్నిస్తున్నారట. కానీ ఏదో రకంగా నెట్టింట తమ పేర్లు బయటపడుతూనే ఉంటాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్ సీజన్-8 లో సురేఖావాణి, కమెడియన్ కిరాక్ ఆర్పీ, బర్రెలక్క, హేమ, హీరో రాజ్ తరుణ్, కుమారీ ఆంటీ, యాంకర్ రీతూ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య గురించి తెలిసిందే. ప్రణయ్ భార్య అమృత కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. దాదాపు 20 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగు పెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 4 న లేదా 11 వ తారీకుల్లో సీజన్ -8 ప్రారంభం కానుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. 


Similar News