అమెరికాలో టీజర్‌ విడుదల చేసుకున్న తొలి చిత్రం ఇదే

కొత్తదనంతో కూడిన చిత్రాలు, వైవిధ్యమైన కథలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

Update: 2024-09-29 11:57 GMT

దిశ, సినిమా: కొత్తదనంతో కూడిన చిత్రాలు, వైవిధ్యమైన కథలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మన పురాణాలు, ఇతిహాసాల జానర్‌లో రాబోతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్‌’. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ మూవీకి కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై పద్మ రావినూతుల, హిరణ్య రావినూతల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇది నవంబర్ 8న విడుదల కానుంది.

తాజాగా, ‘రహస్యం ఇదం జగత్‌’ టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేశారు మేకర్స్‌. తొలిసారిగా ఓ తెలుగు చిత్రం అమెరికాలో టీజర్‌ విడుదల చేయడం ఇదే తొలిసారి. డల్లాస్‌లోని యూనివర్శిటి ఆఫ్‌ టెక్సాస్‌ డల్లాస్‌లో ఈ ఈవెంట్ జరిగింది. అక్కడున్న క్యాంపస్‌ మూవీ థియేటర్‌లో టీజర్‌ ఆవిష్కరణ జరగ్గా యూనివర్శిటి స్టూడెంట్స్‌తో పాటు అమెరికాలోని సినీ ప్రేమికులు హాజరయ్యారు. ఇప్పటి వరకు యూఎస్‌లో ఇలాంటి ఫంక్షన్‌ జరగడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఎత్తున్న ఆడియన్స్‌ హాజరయ్యారు. టీజర్‌ చూస్తుంటే అందరిలో సినిమాపై మంచి బజ్‌, ఇంట్రెస్ట్‌ కలుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.


Similar News