‘ఇడ్లీ కడై’ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్న యువ నటుడు.. క్లారిటీ ఇదే!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకుడిగా వరుస సినిమాలు తెరకెక్కిస్తూ సత్తా చాటుతున్నారు.

Update: 2024-09-25 11:02 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ దర్శకుడిగా వరుస సినిమాలు తెరకెక్కిస్తూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన ‘రాయన్’ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇదే ఫామ్‌తో ధనుష్ తన సినిమాలనే తనే డైరెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రజెంట్ ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడ్లీ కడై’. దీనికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండగా.. డాన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో అశోక్ సెల్వన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే విషయంపై అశోక్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయి క్లారిటీ ఇచ్చారు. ‘‘ధనుష్ వీరాభిమానిగా ప్రేమిస్తున్నాను. భవిష్యత్తులో ఆయన మూవీలో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను. కానీ ఇడ్లీ కడై మూవీలో మాత్రం నేను నటించడం లేదు’’ అని స్పష్టం చేశారు.


Similar News