పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ బ్యూటీ.. అదే ముహుర్తానికంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఇండోర్‌కు చెందిన చిత్ర శుక్ల 2017లో ‘మా అబ్బాయి’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయింది.

Update: 2024-10-04 09:05 GMT

దిశ, సినిమా: ఇండోర్‌కు చెందిన చిత్ర శుక్ల 2017లో ‘మా అబ్బాయి’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత రంగుల రాట్నం, సిల్లీ ఫెలోస్, పక్కా కమర్షియల్, ఉనికి, మస్త్ షేడ్స్ ఉన్నాయిరా, కలియుగ పట్టణంతో వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. ఇక చిత్ర శుక్ల పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత ఏడాది డిసెంబర్‌లో వైభవ్ ఉపాధ్యామ అనే పోలీస్ అధికారిని పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుండి ఈ అమ్మడు సోషల్ మీడియాకు, ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, చిత్ర శుక్ల తల్లి అయినట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. సెప్టెంబర్ 30న రాత్రి 9:31 నిమిషాలకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘మా వివాహ ముహూర్తం ఉదయం 9.31 గంటలకు.. మా బాబు కూడా అదే ముహూర్తానికి రాత్రి 9.31 గంటలకు పుట్టాడు. మా కుటుంబం మొత్తం ఉప్పొంగిపోయి, ఆనందంగా ఉంది. నాకు కలలో జీవిస్తున్నట్లు అనిపిస్తుంది.

ఉపాధ్యాయ కుటుంబానికి చెందిన తర్వాతి తరం వచ్చేసింది. కుటుంబం మొత్తం అనేక సమయాల్లో అనేక రకాలుగా ఎన్నో కష్టాలను అనుభవించింది. కానీ దేవుడు ఆశీర్వదించాడు. అన్ని బాధలను ఎలా తొలగించాలో, ప్రతి భాగాన్ని ఆనందంతో ఎలా నింపాలో ఆయనకు తెలుసు’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా తన బాబు ఫొటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం చిత్ర పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కంగ్రాట్స్, మీ బాబు చాలా క్యూట్‌గా ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు.


Similar News