విడుదలైన వారంలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

తమిళ స్టార్ హీరో కార్తి, అరవింద్ స్వామి నటించిన తాజా చిత్రం సత్యం సుందరం.

Update: 2024-10-02 02:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో కార్తి, అరవింద్ స్వామి నటించిన తాజా చిత్రం సత్యం సుందరం. ‘96’(తెలుగులో జాను) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమిళ స్టార్ హీరో సూర్య, సతీమణి జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీ దివ్య, స్వాతి కొండేటి, దేవదర్శిని ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది.

ఇదిలా ఉంటే.. విడుదలైన వారం రోజులకే సత్యం సుందరం మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుందట. దీనికి సంబంధించిన డేట్ కూడా బయటకు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు ఈ సినిమాను కొనుగోలు చేసిందట. ఇక వాళ్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ మూవీని నవంబర్ 14న దీపావళి సందర్భంగా ఓటీటీలో విడుదల చేయాలట. అయితే సినిమా రన్ ఆగిపోతే ఇంకా ముందే ఓటీటీలో విడుదల అవొచ్చు అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. కాగా ఈ నెలాఖరున దీనికి సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.


Similar News