The Kerala Story 2: హేమ కమిటీ రిపోర్ట్‌‌‌‌తో ‘ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-09-25 11:53 GMT

దిశ, సినిమా: ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ వల్ల మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హేమ కమిటీని తీసుకొచ్చారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఇది చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటి కమిటీ రావాలని ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. అలాగే పలువురు హీరోయిన్లు సామ్‌కు సపోర్ట్‌గా నిలిచారు. అయితే హేమ కమిటీ రిపోర్ట్‌పై సినిమా రాబోతున్నట్లు గత కొద్ది రోజుల నుంచి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ ‘ది కేరళ స్టోరీ’ సీక్వెల్‌‌లో యాడ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో.. ది కేరళ స్టోరీ డైరెక్టర్ సుదీప్తో సేన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ‘‘ఇలాంటి రూమర్స్ ఎలా మొదలవుతాయో అర్థం కావడం లేదు. కానీ వాటిని చూసి నేను ది కేరళ స్టోరీ నిర్మాత ఫుల్ గా నవ్వుకున్నాం. అయితే ఈ చిత్రానికి సిక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 రాబోతుంది. కానీ హేమ కమిటీ రిపోర్ట్‌కు దీనికి సంబంధం లేదు. కాబట్టి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయడం ఆపండి. అయితే ఈ మూవీ భారతీయ రాజకీయాలు, మతాలకు సంబంధం ఉండదు. వచ్చే ఏడాదిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమాలో కొత్త వారు కనిపిస్తారు. ప్రజెంట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది’’ అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News