నా లైఫ్‌లో అత్యంత బాధాకరమైన విషయం అదే.. నాగార్జున ఎమోషనల్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇటీవల నా సామిరంగ మూవీతో ప్రేక్షకులను అలరించాడు.

Update: 2024-07-06 11:35 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఇటీవల నా సామిరంగ మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం నాగ్, ధనుష్ కాంబోలో తెరకెక్కుతున్న కుబేర సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికీ వరుస మూవీస్ చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ నిస్తున్నాడు. ఇక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే నాగార్జున మొదట దగ్గుబాటి వెంకటేష్ చెల్లి లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి నాగచైతన్య పుట్టాడు. ఆ తర్వాత ఈ జంట విడాకులు తీసుకుని విడిపోయింది. ఇక నాగ్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి అఖిల్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం నాగచైతన్య ఒంటరిగానే ఉంటున్నాడు అప్పుడప్పుడు తన తల్లి లక్ష్మి దగ్గరకు వెళ్లి వస్తుంటాడు. ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నాడు చై.

తొందరలోనే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తండ్రి నాగార్జున తన జీవితంలో అత్యంత బాధాకరమైన విషయాన్ని వెల్లడించాడు. ‘‘ నా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయం ఇదే.  లక్ష్మితో విడాకులు తీసుకున్న తర్వాత చైని తన తల్లితో పంపాల్సి వచ్చింది. నేను చాలా బాధ పడిన క్షణాలవే. కానీ తప్పలేదు ఎందుకంటే వాడు వాళ్ల అమ్మ దగ్గరే పెరగాలి కాబట్టి పంపించాను. అప్పుడప్పుడు వస్తూ వెళుతూ ఉండేవాడు అది కాస్త సంతోషాన్ని కలిగించింది. ఇక స్కూలింగ్ అయిపోగానే హైదరాబాద్‌కు వచ్చి నాతోనే ఉండేపోయాడు. అయినప్పటికీ నాగచైతన్య చిన్నతనంలో నాతో లేడన్న బాధ ఇప్పటికీ ఉంటుంది. ’’ అని చెప్పుకొచ్చాడు.


Similar News