రాజేంద్రప్రసాద్‌ కుమార్తె మరణం.. సీఎం చంద్రబాబు, లోకేష్ సంతాపం

సినీనటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ స్పందించారు.

Update: 2024-10-05 06:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీనటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ స్పందించారు.‘‘సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి చిన్న వయసులోనే అకాల మరణానికి గురికావడం అత్యంత దురదృష్టకరం. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుంటున్నాను’’ అని చంద్రబాబు సంతాపం తెలియజేయగా.. ‘‘నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి మృతి బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అంటూ నారా లోకేశ్ తన సానుభూతి ప్రకటించారు.


Similar News