Pawan Kalyan: ‘OG’ అప్డేట్ ఇచ్చిన తమన్.. మాస్ రాంపేజ్ రాబోతుదంటూ పోస్ట్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓజీ’.

Update: 2024-09-23 12:21 GMT

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుజిత్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓజీ’. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలో అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ కొంత పూర్తయినప్పటికీ ఎక్కువగా అప్డేట్స్ విడుదల కాలేదు.

ఇక రిలీజ్ అయినవి మాత్రం భారీ రెస్పాన్స్‌కు దక్కించుకున్నాయి. దీంతో పవన్ అభిమానులు షూటింగ్ పూర్తి చేసి సినిమాను విడుదల చేయాలని గత కొద్ది రోజుల నుంచి పలు పోస్టులు పెడుతూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓజీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్న తమన్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చాడు. ఇందులో మాస్ సాంగ్‌ తొందరలో రాబోతున్నట్లు వెల్లడించాడు. అంతేకాకుండా ఈ పాటను హీరో శింబు పాడినట్లు ఫొటో ద్వారా తెలిపాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవడంతో పాటు డేట్ చెప్పమని కామెంట్లు పెడుతున్నారు.


Similar News