కిస్ సీన్ చేయాలంటే ఏడ్చేసిన.. కానీ చివరికి అలా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
తెలుగులో హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీలో నటించిన శృతి శర్మ అందరికీ సుపరిచితమే.
దిశ, సినిమా: తెలుగులో హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీలో నటించిన శృతి శర్మ అందరికీ సుపరిచితమే. తర్వాత అనేక షోలలో కనిపించి మెప్పించింది. రీసెంట్గా సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన సూపర్ హీట్ వెబ్ సిరీస్ ‘హీరామండి’లో ఓ కీలక పాత్ర పోషించింది. ఇక స్వాతంత్య్రానికి ముందు పాక్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ను తీసుకొచ్చారు. ఇందులో మనీషా కొయిరాలా, ఆదితిరావు హైదరీతో పాటు ఆరుగురు హీరోయిన్స్ నటించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. తనకు రొమాంటిక్ సీన్స్ చేయడం, స్క్రీన్ పై కిస్ సీన్స్లో నటించడం ఇష్టం లేదని.. ఎప్పటికీ తాను స్క్రీన్ పై రొమాన్స్ సీన్ చేయనని.. అందుకే ఎన్నో ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. అయితే తన నిర్ణయం గురించి బాధపడడం లేదని చెప్పుకొచ్చింది. కానీ హిరామండి సిరీస్లో మొదటిసారి కిస్ సీన్లో నటించానని.. నేను షూటింగ్ కంటే ముందు స్క్రిప్ట్ మొత్తం చదివినా కిస్ చేయాల్సి రావడంతో ఏడ్చేసిన.. ఆ తర్వాత ఆ సీన్ చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలిపింది శృతి.
కాగా హిరామాండి వెబ్ సిరీస్లో శ్రుతి ‘షామా’ అనే పనిమనిషి పాత్రలో కనిపించింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది.