మైఖేల్ జాక్సన్ బయోపిక్ తెరకెక్కిస్తా.. హీరో ఎవరంటే.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఎలాంటి మొహమాటం లేకుండా బాలీవుడ్ సీక్రెట్స్ అన్నీ

Update: 2024-04-08 12:12 GMT

 దిశ, సినిమా : ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. ఎలాంటి మొహమాటం లేకుండా బాలీవుడ్ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టాడు. క్రిటిక్స్‌ కూడా అమ్ముడుపోతున్నారని ఓపెన్‌గా చెప్పేశాడు. ఇదిలా ఉంటే.. ఓ ఇంటర్వ్యూలో మైఖేల్ జాక్సన్ బయోపిక్ తెరకెక్కించాలని ఉందన్నాడు ఈ కాంట్రవర్షియల్ డైరెక్టర్. కానీ అసలైన ప్రశ్న.. ఆయన పాత్రలో ఎవరు నటిస్తారనేదని బాధపడ్డాడు. ‘మైఖేల్ ఇంట్రెస్టింగ్ లైఫ్ లీడ్ చేశాడు. చైల్ట్ హుడ్ నుంచి స్కూల్.. స్కిన్ కలర్ చేంజింగ్.. ఆయనది గ్రేట్ స్టోరీ, గ్రేట్ జర్నీ. అది నా డ్రీమ్. అందరూ టికెట్ కొని చూసే సినిమా. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్ చేసినా నేను టికెట్ కొని చూస్తా. ఎందుకంటే ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది’ అని చెప్పుకొచ్చాడు.

ఇక సందీప్ తన తర్వాతి ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ ‘యానియల్’ కంటే పది రెట్లు వాయిలెంట్‌‌గా ఉండబోతుందని ప్రకటించాడు.



Similar News