ఏడాదిన్నర తర్వాత మీడియా ముందుకు రాబోతున్న సమంత.. ఆనందంలో అభిమానులు (పోస్ట్)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’.

Update: 2024-10-07 12:13 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జిగ్రా’. ఈ సినిమాను వాసన్ బాలా తెరకెక్కించగా.. ధర్మా ప్రొడక్షన్స్, ఎటర్‌నల్ బ్యానర్స్‌పై కరణ్ జోహార్ నిర్మించారు. తమ్ముడి కోసం అక్క చేసే పోరాటం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ‘జిగ్రా’ మూవీ అక్టోబర్ 11న థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, మేకర్స్ ‘జిగ్రా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 8న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరగనున్న ఈ వేడుకకు అతిథులుగా టాలీవుడ్ స్టార్ రాబోతున్నట్లు మేకర్స్ పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ త్రివిక్రమ్, రానా దగ్గుబాటి రాబోతున్నట్లు పోస్టర్ షేర్ చేశారు.

కాగా, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాదిన్నర నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. మయోసైటీస్ వ్యాధి రావడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయి రెస్ట్ తీసుకుంటోంది. ఇప్పుడు కొద్దిగా కోలుకోవడంతో దాదాపు ఏడాదిన్నర తర్వాత అలియా భట్ కోసం మీడియా ముందుకు రాబోతుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న సామ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Similar News