షాకింగ్ నిర్ణయం తీసుకున్న సమంత! చైతన్య శోభిత నిశ్చితార్థం తర్వాత అక్కడికి వెళ్లి పోతున్న సామ్?

స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

Update: 2024-08-13 02:39 GMT

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే గత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధి బారిన పడి సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ బ్యూటీ. అయినప్పటికీ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది అని అనడంలో ఏ మాత్రం అతియోశక్తి లేదు. ఇక రీసెంట్‌గానే ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌తో మళ్లీ మనముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నది. అలా సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుండగా తన మాజీ భర్త నాగచైతన్య శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకోవడం ఒకరకంగా ఆమెకు షాక్ తగిలినట్లయింది. అయితే అధికారికంగా ఆమె దీనిపై స్పందించిన పోయినప్పటికీ గతంలో వివిధ సందర్భాల్లో తన పెళ్లి, వివాహ జీవితంపై చేసిన పరోక్ష వ్యాఖ్యలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే సామ్ ప్రస్తుతం వీటన్నింటినీ మరిచిపోయి సినిమాల్లో బిజీ అవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే సమంత ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నదట. ఇంతకీ అదేమిటంటే? ఈ అమ్మడు ఇప్పటినుంచి తెలుగులో ఇక నటించకూడదని డిసైడ్ అయ్యిందని టాక్ వినబడుతోంది.. టాలీవుడ్‌లో ఎన్ని సినిమాలు చేసినా, తన వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టి చూస్తున్నారని, తన పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని సమంత బాధపడుతోందట.

అంతేకాకుండా రీసెంట్‌గా తన మాజీ భర్త నాగచైతన్య.. శోభితా ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని, రెండో పెళ్లికి సిద్ధం కావడంతో సమంతపైన సానుభూతి వస్తోంది. అయితే సినిమాలో ఏ హీరోతో రొమాన్స్ చేసినా, మళ్లీ ట్రోలింగ్ రావడం కామన్. ఇప్పటికే 'ఖుషీ' సమయంలో ఇదే రకమైన ట్రోలింగ్ ఫేస్ చేసింది సామ్. అందుకే కోలీవుడ్‌లో, బాలీవుడ్‌లో మాత్రమే నటించాలని నిర్ణయం తీసుకుందట సమంత. ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ఈ వార్త నెట్టింట బాగా చక్కర్లు కొడుతుంది.

Tags:    

Similar News