Sai Dharam Tej: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సాయి ధరమ్ తేజ్.. సినీ నటులను బలి చేయవద్దని సంచలన ట్వీట్

కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఆమెపై ఫైర్ అయ్యారు.

Update: 2024-10-03 11:32 GMT

దిశ, సినిమా: కొండా సురేఖ చేసిన కామెంట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ఆమెపై ఫైర్ అయ్యారు. ఈ విషయంపై టాలీవుడ్ సెలబ్రిటీలంతా ఏకమై కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తాజాగా, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ‘X’ వేదికగా రియాక్ట్ అయ్యారు. ‘‘రాజకీయాలో వ్యక్తిగత విమర్శలు సర్వ సాధారణమైపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారు, నిన్నటి రోజున రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేస్తూ ఒక ప్రఖ్యాత కథానాయకి పేరును ఉపయోగించడం, ఓ ప్రఖ్యాత సినిమా కుటుంబ వ్యవహారాలను ఉటంకించి, మీడియా ముఖంగా మాట్లాడటం, వారికి రాజకీయంగా ఎంత లబ్ధి చేకూరుతుందో తెలియదు.

కానీ ఓ మహిళ ఆత్మాభిమానం, ఓ కుటుంబం పరువు, ప్రతిష్టలకు తీరని నష్టం, అన్యాయం జరిగింది. గౌరవనీయులైన మంత్రివర్యులకు.. రాజకీయ విమర్శలకు, ఏ మాత్రం సంబంధం లేని, తెరమీద తప్ప జీవితంలో నటించలేని సున్నిత మనస్కులైన సినీ నటులను బలి చేయవద్దని కోరుతున్నా. జరిగిన తొందరపాటు చర్యను, విజ్ఞులైన మీరు పెద్ద మనసుతో సరిదిద్దే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, భవిషత్తులో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారని వినమ్రంగా విన్న వించుకుంటున్నా’’ అని అన్నారు.


👉 Also Readకొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ రామ్ గోపాల్ వర్మ 



Similar News