పిల్లల విషయంలో దయచేసి అలా చేయకండి అంటూ వేడుకుంటున్న సాయి ధరమ్ తేజ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2023లో విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Update: 2024-07-07 06:06 GMT

దిశ, సినిమా: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2023లో విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత తన మేనమామ పవన్ కల్యాణ్‌తో కలిసి బ్రో మూవీ చేశాడు. కానీ ఇది ఊహించిన విధంగా హిట్ సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో SDT18 అని వర్కింగ్ టైటిల్‌తో ఉన్న మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోహిత్ కేపీ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైపోయింది. అయితే ఈ చిత్రాన్ని ఏకంగా రూ. 125 కోట్ల బడ్జెట్‌తో నిరంజర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సాయి ధరమ్ తేజ్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు.

నిత్యం పలు పోస్టులతో అభిమానులకు పలు విషయాలు తెలుపుతున్నారు. తాజాగా, మెగా మేనల్లుడు ట్విట్టర్ వేదికగా ప్రజలను వేడుకున్నాడు. ‘‘సోషల్ మీడియా ప్రపంచం క్రూరమైనది, ప్రమాదకరమైనదిగా మారింది. నియంత్రించడం చాలా కష్టం కాబట్టి మీరు మీ పిల్లల వీడియోలు ఫోటోలు పోస్ట్ చేసేటప్పుడు దయచేసి కొంత విచక్షణను ఉపయోగించమని తల్లిదండ్రులందరికీ నా అభ్యర్థన. లేదా ఈ జంతువులను హింసాత్మకంగా, ప్రమాదకరంగా మారకుండా ఆపండి. దయచేసి మీ పిల్లల చిత్రాలను లేదా వీడియోలను పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి.

జాగ్రత్తగా ఉండడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది చేసే వ్యాఖ్యలు మీరు ఎప్పటికీ చూడలేరు.. చూసి తట్టుకోలేరని నేను భావిస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ఫొటోలను, వీడియోలను పెట్టకపోవడం మంచిది’’ అని రాసుకొచ్చాడు. అయితే ఓ తండ్రీకూతుళ్ల బంధం విషయంలో నెటిజన్లు చేసిన కామెంట్స్‌కు సాయి ధరమ్ తేజ్ ఇలా రియాక్ట్ అయినట్లు సమాచారం. ఇక అది చూసిన ఫ్యాన్స్ సూపర్ అన్నా మీరు అంటున్నది వాస్తవం అని సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

 


Similar News