స్టార్ హీరోల సెన్సేషనల్ మూవీస్ రీరిలీజ్ డేట్స్ కన్ఫామ్.. ఇక థియేటర్లలో జాతరే!

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అగ్రహీరోల పుట్టినరోజు సందర్భంగా వాళ్ల పాత హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు.

Update: 2023-08-09 03:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్‌లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అగ్రహీరోల పుట్టినరోజు సందర్భంగా వాళ్ల పాత హిట్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలను విడుదల చేశారు. తాజాగా.. మహేశ్ బాబు బర్త్ డే సంరద్భంగా పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన బిజినెస్‌మెన్ చిత్రాన్ని రీరిలీజ్ చేశారు. అంతేగాక, మరికొన్ని చిత్రాలు రీరిలీజ్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో పవన్ కల్యాణ్ నటించిన గుడుంబా శంకర్, ప్రభాస్ నటించిన యోగి చిత్రాలు ఉన్నాయి. గుడుంబా శంకర్‌ను సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయనుండగా.. యోగి చిత్రాన్ని ఆగస్టు 18న విడుదల చేయనున్నారు. అంతేగాక, రవితేజ నటించిన సెన్సేషనల్ మూవీ వెంకీని ఈ ఏడాది డిసెంబర్ 30న విడుదల చేయనున్నారు.

Read More:   మొదటి మూవీతోనే భారీ సక్సెస్‌ను అందుకొన్న టాప్ 10 డైరెక్టర్స్ వీళ్లే..?

Tags:    

Similar News