Adipurush :ఆ భయంతో ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్, ఇంటర్య్వూలు చేయలేదా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’.

Update: 2023-06-15 06:21 GMT

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’. దీనికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల తిరుపతి జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఆదిపురుష్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ బాషల్లో జూన్ 16న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. కానీ ఈ పాన్ ఇండియా చిత్రానికి చిత్ర యూనిట్, ప్రభాస్ ఎటువంటి ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొనలేదు. గతంలో ప్రభాస్ ..తన చిత్రాలు సాహో, రాధేశ్యామ్ చిత్రాల రిలీజ్ టైమ్ లో చాలా ఇంటర్వూలు ఇచ్చారు.

అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడటం తప్పించి , ప్రభాస్ ఆదిపురుష్ సినిమా గురించి ఏ మీడియాతోనూ పనిగట్టుకుని ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. సాధారణంగా పాన్ ఇండియా సినిమాలు బాహుబలి, పుష్ప ప్రమేషన్స్ ఎప్పటికీ మర్చిపోరు. అలాంటిది అత్యంత భారీ చిత్రంగా రూపోందిన ఆదిపురుష్‌కు ప్రమోషన్స్ ప్రమోషన్స్ చేయకపోవడానికి ఓ బలమైన కారణం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఈ సినిమా టీజర్ విడుదలయ్యాక భారీ ఎపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్’.న వివాదాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలెడితే అందులో మాట్లాడే మాటలు వివాదాలకు దారి తీస్తాయనే భయంతో వద్దనకున్నట్లు టాక్. ఈ క్రమంలోనే సినిమా విడుదలకు తక్కువ టైమ్ ఉండటంతో భక్తి అనే అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారని నెటిజన్లు అనుకుంటున్నారు.

Also Read:   ‘విరాట‌ప‌ర్వం’ దర్శకుడితో ధ‌నుష్ మూవీ? 

Tags:    

Similar News