పవన్ కళ్యాణ్ 2029లో CM, 2034లో ప్రధానమంత్రి అవుతారు.. ప్రముఖ కొరియోగ్రాఫర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు.

Update: 2024-09-03 08:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఎన్ని పరాజయాలు చవిచూసిన వెనకడుగెయకుండా, ప్రజల కోసం నిరాశ చెందకుండా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. చివరకు ఫలితం దక్కడంతో అటు మెగా ఫ్యామిలీ అండ్ పవర్ స్టార్ అభిమానులు సంతోషంలో మునిగితేలారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏపీ పాలనపై ఫోకస్ పెట్టారు. ఇకపోతే పవన్ ఊహించని మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ఎలా అయ్యారో.. 2029లో సీఎం అవుతారని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పవర్ స్టార్ 2034 లో ప్రధానమంత్రి అవుతాడన్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రముఖ కొరియోగ్రఫీ అయిన జానీ మాస్టర్ ఎమ్మెల్యే సినిమాకు కొరియోగ్రఫీ చేశారు. అలాగే మారి-2 లో రౌడీ బేబీ సాంగ్ కోసం ప్రభుదేవాతో కలిసి పనిచేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురములో బుట్ట బొమ్మ పాటకు కూడా కొరియోగ్రఫీ అందించి తెలుగు ప్రేక్షకుల వద్ద ప్రశంసలు దక్కించుకున్నారు. రచ్చలో (దిల్లకు దిల్కు), పూల రంగడు (చాక్లెట్ కన్నుల), జులాయి (మీ ఇంటికి ముంద), నాయక (లైలా ఓ లైలా), (శుభలేఖ రాసుకున్నా), బాద్షా (రంగోలి రంగోలి), ఇద్దరమ్మాయిలతో (గ్యాంగ్ లీడర), సుకుమారుడు (టోంగి టోంగీ), అడ్డా (హే మిస్టర్), మసాలా (నిను చూడనీ) వంటి సినిమాల్లోని పాటలకు కూడా కొరియోగ్రఫీ చేసి మంచి గుర్తింపు దక్కించుకున్నారు.  


Similar News