MAA: ఎంత పెద్దవాళ్లనైనా విచారిస్తాం.. దామోదర్ ప్రసాద్ కామెంట్స్ వైరల్

ఎంత పెద్దవాళ్లనైనా విచారిస్తాం

Update: 2024-09-19 06:14 GMT

దిశ, వెబ్ డెస్క్ : లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగికంగా దాడి చేశాడంటూ జానీ మాస్టర్ పై కేసు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇది ఆల్రెడీ సంచలనం అయింది.. తాజాగా పూనమ్ కౌర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ పై చేసిన అరోపణలు సంచనలంగా మారాయి. ఈ ముద్దుగుమ్మ ఏకంగా త్రివిక్రమ్ అని నేరుగా పోస్టులో పెట్టి మరి పోస్టు చేసింది. ఇది చూసిన ప్రతి ఒక్కరు వీరిద్దరి మధ్య ఏం జరిగింది? ప్రతి సారి త్రివిక్రమ్ నే ఎందుకు టార్గెట్ చేస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు సినీ ఇండస్ట్రీ లో పని చేసే మహిళల భద్రత విషయంలో ఇతర వాటితో పోల్చి చూస్తే చాలా ముందుందని తెలిపారు. అమ్మాయిలు పని చేసే ప్రదేశంలో వేధింపులు ఉంటే ఎవర్ని వదలము .. ఎంత పెద్దవాళ్లనైనా విచారిస్తామని తెలిపారు. పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కంటే వెళ్ళి రిపోర్ట్ చేస్తే బెటర్ అని నెటిజెన్స్ సూచిస్తున్నారు.  

Tags:    

Similar News