Niharika : ఈ ఏడాది మాకు అద్భుతంగా ఉంది.. మెగా ఫ్యామిలీపై నిహారిక వైరల్ కామెంట్స్

మెగా డాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’.

Update: 2024-08-06 09:00 GMT

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 15 మంది కొత్త నటులతో దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇందులో నుంచి వచ్చిన ప్రతి పోస్టర్‌తో పాటు అప్‌డేట్స్ ఎంతో ఆకట్టుకోగా.. రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెగా డాటర్ నిహారిక మాట్లాడుతూ.. సినిమాపై, తన ఫ్యామిలీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘ఈ సినిమాలో ప్రేక్షకులకు పరిచయం ఉన్న ఆర్టిస్టులను పెట్టాలి అనుకున్నాను. కానీ కొత్తవారితో చేద్దామని డైరెక్టర్ వంశీ అన్నారు. కానీ ఇప్పుడు 15 మంది టాలెంట్ ఉన్న కొత్త ఆర్టిస్టులను ఇండస్ట్రీకి ఇచ్చాననే తృప్తిని నాకు ఇచ్చారు. ఆగస్టు 9 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మీకు ఇది నచ్చుతుందని.. మీరు అందరూ దీన్ని ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే ఫ్యామిలీ గురించి చెప్తూ.. ‘మా అన్నయ్య వరుణ్ నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటాడు. ఇక అందరూ బాగుండాలి, ఆనందంగా ఉండాలని కోరుకునే మా బావ (సాయి దుర్గా తేజ్) ఈ ఈవెంట్‌కు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మా కుటుంబానికి అద్భుతంగా ఉంది. మా పెదనాన్నకు పద్మవిభూషన్ వచ్చింది. బాబాయి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇక చరణ్ అన్న సినిమా ఆస్కార్స్‌కు వెళ్లింది.. అలాగే నేను కూడా నిర్మాతగా నా ఫస్ట్ సినిమాతో వస్తున్నాను. ఇలాగే మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News