Naga Babu: నెట్టింట దుమారం రేపుతున్న నాగబాబు ట్వీట్..

నెట్టింట దుమారం రేపుతున్న నాగబాబు ట్వీట్

Update: 2024-09-19 08:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో గత రెండు రోజులు నుంచి జానీ మాస్టర్ పేరు తప్ప వేరేది వినపడటం లేదు.. ఈ సెలబ్రిటీలతో వచ్చిన సమస్య ఇదే.. వీళ్లు మంచి పనులు చేసిన పాపులర్ అవుతారు .. చెడ్డ పనులు చేసిన పాపులర్ అవుతారు. మరి వీళ్ళతో అలా ఉంటుంది. ఓ మహిళా కొరియాగ్రాఫర్ తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేశాడంటూ ఆరోపణలు చేసింది. ఇది మాత్రమే కాకుండా ఆమె మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరించిందంటూ ఆరోపణలు చేస్తూ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ మొదలు పెట్టారు . దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడింది.

అయితే, జానీ మాస్టర్ టాలీవుడ్ లో ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ చేసాడు .. ఇంత వరకు ఏ హీరో కూడా దీన్ని ఖండించకపోవడంతో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. జానీ మాస్టర్ నిజంగా తప్పు చేశాడా అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నాడు అవి నెట్టింట దుమారం రేపుతున్నాయి. ”నేరం ఏదైనా కోర్టు నిర్ధారించేంత వరకు ఎవరూ నిందితులు కాదు. విన్న ప్రతిదీ నమ్మొద్దు, ప్రతి కథలోనూ 3 వెర్షన్లు ఉంటాయని ట్వీట్ చేశారు”. జానీ మాస్టర్ అరెస్టు అయినా సమయంలో ఇలాంటి ట్వీట్ పెట్టడంతో దీంతో ఈ ట్వీట్లు జానీ మాస్టర్ కేసు గురించేనా? నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.

Read More..

జానీ మాస్టర్ అత్యాచారం కేసులో నాగబాబు షాకింగ్ ట్వీట్ 


Click Here For Twitter Post.. 

Tags:    

Similar News