జానీ మాస్టర్ అత్యాచారం కేసులో నాగబాబు షాకింగ్ ట్వీట్

జానీ మాస్టర్ అరెస్ట్ అయిన కొద్ది సేప‌టికే.. మెగా బ్రదర్, జ‌న‌సేన కీల‌క నేత‌ నాగబాబు ఓ ట్వీట్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Update: 2024-09-19 08:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు మరో కొత్త మలుపు తిరిగింది. 4 రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్‌‌ని ఎట్టకేలకు ఎస్వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గోవా కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపర్చిన పోలీసులు.. పీటీ వారెంట్‌ కింద హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే అతడిని శుక్రవారం నాడు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

జానీ మాస్టర్ అరెస్ట్ అయిన కొద్ది సేప‌టికే.. మెగా బ్రదర్, జ‌న‌సేన కీల‌క నేత‌ నాగబాబు ఓ ట్వీట్ చేసారు. ‘న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు’ అని ఓ బ్రిటిష్ లాయర్ విలియం గారో చెప్పిన ఓ కొటేష‌న్‌ని నాగ‌బాబు ట్వీట్ చేశారు. అయితే నాగ‌బాబు ట్వీట్ ప‌రోక్షంగా జానీ మాస్టర్‌ను ఉద్దేశించే చేశారంటున్నారు కొంతమంది నెటిజన్లు. కాగా, మెగా ఫ్యామిలీతో జానీకి మంచి బాండింగ్ ఉంది. జనసేనలో కూడా జానీ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. కానీ ఇప్పుడు లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌డంతో.. పార్టీకి దూరంగా పెట్టామంటూ జనసేన అధికారిక ప్రకటన కూడా చేసింది. ఇలాంటి టైంలో నాగబాబు చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది.

Read More..

‘కొంత మంది అమ్మాయిలు ఎదిగిన అబ్బాయిల కెరీర్‌ను దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు’.. లేడీ కొరియోగ్రాఫర్ సంచలన కామె... 


Click Here For Twitter Post.. 

Read More..

‘తప్పు చేసి ఉంటే లొంగిపోండి మాస్టర్’.. జానీ మాస్టర్‌కు తెలుగు హీరో మెసేజ్ 


Similar News