Megastar Chiranjeevi: నిహారిక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్.. వీడియో బైట్ రిలీజ్ చేసిన మెగాస్టార్

మెగా డాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’.

Update: 2024-08-06 13:11 GMT

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 15 మంది కొత్త నటులతో దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇందులో నుంచి వచ్చిన ప్రతి పోస్టర్‌తో పాటు అప్‌డేట్స్ ఎంతో ఆకట్టుకోగా.. రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, అడివి శేష్, వెంకీ అట్లూరి తదితరులు హాజరయ్యారు. ఇక ఇందులో స్పెషల్ అట్రాక్షన్‌గా మెగాస్టార్ చిరంజీవి వీడియో బైట్ రిలీజ్ చేశారు.

‘మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఆగస్ట్ 9న రాబోతోంది. ఆల్రెడీ నేను ఈ చిత్రాన్ని చూశాను. చాలా బాగుంది. మా నిహారిక మల్టీటాలెంటెడ్. మంచి సినిమాలు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది. మంచి కథ, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ చిత్రం గోదావరి చుట్టు పక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. యదు వంశీకి ఇది మొదటి చిత్రం. అందరూ కొత్త వాళ్లు నటించారు. మంచి విజువల్స్ ఉంటాయి. అనుదీప్ సంగీతం బాగుంది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది.. మూవీ టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

Tags:    

Similar News