‘మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే’.. ప్రజలకు కీలక సూచన చేసిన మెగాస్టార్

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికన ప్రజలందరికీ కీలక సూచన చేశారు.

Update: 2024-09-01 04:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికన ప్రజలందరికీ కీలక సూచన చేశారు. ‘వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పలు గ్రామాలు, జాతీయ రహదారులు నీటితో మునిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యుడిగా నా మనవి ఒక్కటే.. అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటి నుంచి బయటకు రావద్దు. వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉండటం వల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడూ అభిమానులంతా అండగా ఉంటారని ఆశిస్తున్నాను’ అంటూ మెగాస్టార్ చిరంజీవి వరద బాదితులకు ధైర్యం చెబుతూ కీలక సూచనలు చేశారు.


Similar News