సినీ ఫీల్డ్ మంచిది కాదు.. వాటికి బానిసవుతుందని భయపెట్టారు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్

బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ‘యానిమల్’ మూవీతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

Update: 2024-09-21 15:34 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి ‘యానిమల్’ మూవీతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అప్పటి నుంచి వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈమె.. ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అమ్మడు క్రేజ్ మరింత పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఓకే చేస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ.. తన పర్శనల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘మాది ఉత్తరాఖండ్‌ అయినప్పటికీ కుటుంబం ఢిల్లీలో సెటిల్‌ అయింది. నేను పుట్టి, పెరిగిందంతా ఢిల్లీలోనే. చిన్నతనం నుంచి నాకు యాక్టింగ్‌పై చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు వాళ్లు భయపడ్డారు. ధైర్యం చేసి ముంబయి వచ్చా. ఆ సమయంలో మా రిలేటివ్స్, చుట్టుపక్కల వాళ్లు మా ఇంట్లో వాళ్లను భయానికి గురిచేసేవారు. సినీ ఫీల్డ్‌లోకి ఎందుకు పంపించారు. అది మంచిది కాదు. అక్కడకు వెళ్తే చెడు అలవాట్లకు బానిసలుగా మారుతారు. పెళ్లిళ్లు కూడా కావు అని ఎన్నో మాటలు ఎక్కేసి చెప్పేవారు. కానీ నేను మా వాళ్లకు ధైర్యం చెప్పి సినీ ఫీల్డ్‌లో నిలబడ్డాను. స్టార్టింగ్‌లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. ప్రతిరోజూ వర్క్‌ కోసం ప్రయత్నాలు చేసేదాన్ని. చేతిలో అవకాశాల్లేక బాధపడిన క్షణాలు ఎన్నో. కొన్నిసార్లు నమ్మకం కూడా కోల్పోయా. కానీ, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకోవాలని నిర్ణయించుకున్నా. తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లకూడదనుకున్నా. చివరకు హీరోయిన్‌గా ‘లైలా మజ్ను’తో మంచి పేరు సొంతం చేసుకున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.


Similar News