సినీ సెలబ్రిటీల బండారం బయటపెట్టిన మనీషా కోయిరాలా.. స్టార్ హీరోహీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు!

హీరోయిన్ మనీషా కోయిరాలా అందరికీ సుపరిచితమే. తెలుగులో స్టార్ హీరో అర్జున్ సర్జా ఒకే ఒక్కడు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Update: 2024-07-07 07:19 GMT

దిశ, సినిమా: హీరోయిన్ మనీషా కోయిరాలా అందరికీ సుపరిచితమే. తెలుగులో స్టార్ హీరో అర్జున్ సర్జా ఒకే ఒక్కడు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో నెల్లూరు నెరజాన నీ కుంకుమల్లె మారిపోనా అనే సాంగ్‌లో మాస్ డాన్స్ చేసి అందరి మనుస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడే వరుస సినిమాలు చేసింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే తాగుడుకు అలవాటు పడింది. ఆ తర్వాత పెళ్లి కూడా పెటాకులు అయి డిప్రెషన్‌కు గురైంది. ఇక దాని నుండి కోలుకుంటున్న సమయంలోనే అండాశయ క్యాన్సర్ బారిన పడి సినిమాలకు దూరం అయింది. గత కొద్ది కాలంగా చికిత్స తీసుకున్న మనీషా కోయిరాలా క్యాన్సర్ నుంచి కోలుకుని.. ఇటీవల హీరామండి సిరీస్‌లో అదిరిపోయే పాత్రతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ విడుదలై భారీ రెస్పాన్స్ రాబట్టడంతో పాటు.. ఇందులో నటించిన నటీనటులకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ప్రస్తుతం హీరామండి సిరీస్-2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదలైన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా కోయిరాలా సినీ సెలబ్రిటీలపై సంచలన వ్యాఖ్యలు చేసి నెటిజన్లలో కొత్త అనుమానాలు సృష్టించింది. ‘‘ సౌధాగర్ మూవీ చేస్తున్న సమయంలో నాకు కోక్‌లో వొడ్కా కలిపి తాగే అలవాటు ఉండేది. అయితే కొందరు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని సలహా ఇచ్చారు. హీరోయిన్లు ఆల్వహాల్ తాగుతున్నట్లు తెలిస్తే ఆఫర్లు రావు చెప్పకు అన్నారు. నేను సరే అని ఒకరోజు కోక్‌లో వొడ్కా కలుపుకుని తాగుతూ.. మా అమ్మ అడిగితే కూల్‌డ్రింక్ అని అబ్దం చెప్పాను. మా అమ్మకు నా తాగుడు అలవాటు గురించి తెలియడంతో.. నువ్వు ఏది తాగితే అదే బయటకు చెప్పు. కానీ అబద్దాలు మాట్లాడకు. చిన్న చిన్న విషయాలకు అలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నీకు లేదు అని కోపంగా చెప్పింది. ఇక అప్పటి నుంచి నేను ప్రేమలో ఉంటే అందరికీ ఓపెన్‌గా చెప్పేదాన్ని.

నేను ముక్కుసూటీగా మాట్లాడేదాన్ని కాబట్టి కొందరు నన్ను విమర్శించేవారు. అయినా నేను తాగుడు అలవాటున్నా, బాయ్‌ఫ్రెండ్ ఉన్నా నా కెరీర్‌కు అడ్డు రాకుండా చూసుకున్నాను. నా పనిని ప్రేమించి ముందుకు సాగేదాన్ని. అయితే ఆ కాలంలో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు ఎందరో గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ బయటకు తెలిసేది కాదు. హీరోయిన్లు కూడా మమ్మల్ని ఎవ్వరూ తాగలేదు అన్నట్లు ప్రవర్తించేవారు. నాకు అప్పుడు ఆ విషయాలు అర్థం కాలేదు. ఎందుకలా ఉంటారో. కొత్త కాలానికి అర్థం అయి సైలెంట్ అయ్యాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మనీషా కోయిరాలా కామెంట్స్ నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అసలు మనీషా కోయిరాలా ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేసిందని అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.


Similar News