Emergency Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ ట్రైల‌ర్

గూస్ బంప్స్ తెప్పిస్తున్న కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ ట్రైల‌ర్

Update: 2024-08-14 14:03 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘ఎమర్జెన్సీ’ మూవీకి దర్శకత్వం వహించింది. దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటిస్తుంది. ఈ మూవీ 2024 నవంబరు లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ, అనుకున్న సమయానికి మేకర్స్ విడుదల చేయలేకపోయారు. ఆ త‌ర్వాత మళ్ళీ ఈ ఏడాది జూన్ 14న రిలీజ్ చేద్దామని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే అప్పుడు కూడా కుదరలేదు. కంగ‌నా హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ ‘మండి’ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటి చేసి గెల‌వ‌డంతో రాజ‌కీయ‌ల్లో ఫుల్ బిజీ అవ్వడం వలన మళ్ళీ వాయిదా పడింది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ మూవీని ద‌స‌రాకి రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 06న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇండో – పాక్ సమయంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణ‌యాలు.. ట్రైలర్లో హైలెట్ గా ఉన్నాయి.. అలాగే మన దేశంలో చీక‌టిరోజులుగా చెప్పుకునే ‘ఎమర్జెన్సీ’ గురించి అతి త్వరలో చూడబోతున్నాం. ఇక ఈ మూవీలో జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే నటించారు. జీ స్టూడియోస్‌, మణికర్ణిక ఫిలిమ్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Full View

Tags:    

Similar News