Naga Babu: కళ్యాణ్ బాబు నాకు ఒక మాట చెప్పాడంటూ.. నాగబాబు షాకింగ్ పోస్ట్

నాగబాబు షాకింగ్ పోస్ట్

Update: 2024-09-25 02:17 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో లడ్డు వివాదం ఎక్కడికో వెళ్తుంది.. ఎవరు వదిలి పెట్టినా పవన్ కళ్యాణ్ మాత్రం వదిలేలా లేరు.. సనాతన ధర్మం కోసం నేను గట్టిగా నిలబడతాను.. మీరు నా మీద ఎన్ని కేసులు అయిన పెట్టుకోండి.. నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు అంటూ ఇలా మీడియా ముందుకొచ్చిన ప్రతీ సారి మండిపడుతున్నారు. దీంతో పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై చాలా మంది సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇక నటుడు నాగబాబు పవన్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తారని మనకు తెలిసిందే.

తాజాగా, తమ్ముడు పవన్ కు సపోర్ట్ గా నాగబాబు తన ఇన్స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసాడు. ధర్మం గురించి పవన్ నాకు ఓ మాట చెప్పాడు అంటూ నాగబాబు పోస్ట్ చేసారు.

నాగబాబు " హిందూ ధర్మాన్ని అమితంగా నమ్మే కళ్యాణ్ బాబు నాతో చాలా కాలం క్రితం చెప్పిన మాట: సత్య (కృత) యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది. అదే త్రేతాయుగంలో మూడు పాదాలతో ధర్మం ఒక భాగంలో అధర్మం నడిచేది. అలాగే ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాల మీద, అధర్మం రెండు పాదాల మీద నడిచేది. కలియుగం వచ్చేసరికి అధర్మం మూడు పాదాల మీద ధర్మం కేవలం ఒక్క పాదం మీద మాత్రమే నడుస్తుంది. అందుకే ధర్మం ఒక పాదం మీద నడిచినా బలంగా నడవడానికి నా వంతు పాత్ర పోషిస్తాను. నా ప్రయత్నం సంపూర్ణంగా చేస్తాను " అని కళ్యాణ్ బాబు అన్నాడంటూ పోస్ట్ చేసాడు. దీంతో నాగబాబు పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Full View

Tags:    

Similar News