అర్ధరాత్రి స్టార్ క్రికెటర్‌తో జాన్వీ కపూర్.. పిక్స్ వైరల్

Update: 2022-01-26 15:07 GMT

దిశ, సినిమా : జాన్వీ కపూర్ - రాజ్‌కుమార్ రావు కలయికలో రూపొందుతున్న చిత్రం 'మిస్టర్ & మిసెస్ మహి - నో డ్రీమ్ ఈజ్ ఎవర్ ఛేజ్డ్ అలోన్'. క్రికెట్ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను గతేడాది నవంబరు 22న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రికెట్ క్యాంప్‌‌లో ఇండియన్ క్రికెటర్ దినేష్ కార్తీక్‌తో కలిసి సాధన చేస్తున్న గ్లింప్స్‌ను జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

హెల్మెట్‌తో పాటు టీమిండియా యూనిఫామ్‌లో అద్భుతంగా కనిపించిన జాన్వి.. మరో పిక్‌లో దినేష్ కార్తీక్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా గమనిస్తోంది. ఇక ఈ క్యాంపులో దర్శకుడు శరణ్ శర్మ, మూవీ టీమ్‌తో కలిసున్న ఫోటో కూడా షేర్ చేయగా '2022 అక్టోబరు 7న ఫీల్డ్‌లో కలుద్దాం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

https://www.instagram.com/p/CZLiVXvIvvt/?utm_source=ig_web_copy_link

Tags:    

Similar News