ఆ హీరో ఫ్యాన్స్ నన్ను చంపేస్తారని భయపడ్డా: Varalaxmi Sarathkumar

వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌‌గా నటిస్తూ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది..

Update: 2023-01-23 04:06 GMT

దిశ, వెబ్ డెస్క్: వరలక్ష్మీ శరత్ కుమార్ క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్‌‌గా నటిస్తూ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. తాజాగా, బాలకృష్ట 'వీరసింహారెడ్డి' సినిమాలో కీలక పాత్రలో నటించింది. 'వీరసింహారెడ్డి' సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నిన్న రాత్రి చిత్రబృందం హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్శహించారు. ఇందులో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'వీరసింహారెడ్డి' సినిమా విడుదల తర్వాత జై బాలయ్య, జై బాలయ్య అని అరిచి అరిచి తన నోరు పోయింది. ఇంటర్వెల్ సీన్ సమయంలో నేను బాలయ్య బాబును పొడిచేసే సీన్ చూసి ఆయన అభిమానులు చంపేస్తారని భయపడ్డానని వరలక్ష్మి తెలిపింది. ఆ సమయంలో నాకు బాలకృష్ణ ధైర్యం చెప్పారంటూ చెప్పుకొచ్చింది.

ఇప్పుడు ఆ విషయం చెబితే పోలీసులు కేసు బుక్ చేస్తారు: Nandamuri Balakrishna

Tags:    

Similar News