ఐ హేట్ మ్యారేజ్.. కొత్త కాన్సెప్ట్తో మరో చిత్రం
యువ దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల ఓ విభిన్నమైన కాన్సెప్ట్తో ప్రేక్షకల ముందుకు రాబోతున్నాడు.
దిశ, సినిమా: యువ దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల ఓ విభిన్నమైన కాన్సెప్ట్తో ప్రేక్షకల ముందుకు రాబోతున్నాడు. ఆయన డైరెక్ట్ చేస్తున్న 'ఐ హేట్ మ్యారేజ్' సినిమాను ఆర్య సినిమా పతాకంపై ఎం.దయానంద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్లో జరిగింది. సుగి విజయ్, జుప్సీ భద్ర హీరో హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ముహుర్తపు సన్నివేశానికి నిర్మాత శ్రీనివాస రాజు క్లాప్ నివ్వగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ అన్నయ్య, రచయిత, నిర్మాత విజయ్కుమార్ కెమెరా స్వీచ్చాన్ చేశారు. చిత్ర సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి ముహుర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'నేటి యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకలు నచ్చే భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారికి ఆకట్టుకోవడంతో పాటు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ 'సోమవారం నుంచి చిత్రీకరణ ప్రారంభించాం. ఏకధాటిగా డిసెంబర్ వరకు జరగే షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది. రొటిన్కు భిన్నంగా ఓ కొత్త కాన్సెప్ట్తో ఈ చిత్రాన్నిప్రేక్షకులకు అందించబోతున్నాం' అన్నారు.