హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. హెల్ప్ కోరుతూ పోస్ట్

యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కౌసల్య క్రిష్ణ మూర్తి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది..

Update: 2023-03-25 02:57 GMT

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కౌసల్య క్రిష్ణ మూర్తి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల రన్ బేబీ రన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా, ఐశ్వర్య రాజేష్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టా స్టోరీ వేదికగా తెలియజేసింది. అంతేకాకుండా ఆమె ప్రచారకర్త యువరాజ్ ఆ అకౌంట్‌ను రికవరీ చేసేందుకు హెల్ప్ కావాలని ఎలోన్ మస్క్‌కు ట్వీట్ చేశాడు. ‘‘నేను భారతదేశం విదేశాలలో విపరీతమైన అభిమానులను కలిగి ఉన్న సుప్రసిద్ధ దక్షిణ భారత నటి ఐశ్వర్యరాజేష్ ప్రచారకర్త. శ్రీమతి ఐశ్వర్య రాజేష్ యొక్క ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేయబడింది. సమస్యను పరిష్కరించడానికి మీ బృందం నుండి తక్షణ సహాయాన్ని మేము కోరుతున్నాము’’ అంటూ రాసుకొచ్చాడు. త్వరలోనే ఆమె ట్విట్టర్ అకౌంట్ తిరిగి పొందుతారని.. అప్పటివరకు అభిమానులు.. ఫాలోవర్స్ ఆమె ఖాతాలో షేర్ చేసే వాటిని పట్టించుకోవద్దని కోరారు.



Tags:    

Similar News