Raj Tarun: 11 రోజులు ఫుట్‌పాత్‌పై పడుకున్నా.. టాలీవుడ్ యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గత కొద్ది రోజుల నుంచి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-14 08:36 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గత కొద్ది రోజుల నుంచి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. లావణ్య అనే అమ్మాయి ప్రేమించి మోసం చేశాడంటూ పలు సంచలన వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తూ దుమారం రేపుతోంది. అయితే పలు కేసులు కూడా రాజ్‌పై నమోదయ్యాయి. కానీ ముందస్తు బెయిల్ తీసుకోవడంతో జైలుకు వెళ్లలేదు. ఇక ఇటీవల రాజ్ తరుణ్ తప్పు చేశాడంటూ లావణ్య ప్రూఫ్స్ బయటపెట్టడంతో వీరిద్దరూ లవ్ చేసుకోవడం నిజమే అని పోలీసులు నిర్ధారించారు.

ఇదిలా ఉంటే.. రాజ్ తరుణ్ వివాదాలు ఎదుర్కొంటున్నప్పటికీ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన ‘భలే ఉన్నాడే’ మూవీ సెప్టెంబర్ 13న థియేటర్స్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘52 షార్ట్ ఫిల్మ్స్ చేశాక రామ్మోహన్ పిలిచారు. రూ. 3000కు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాను. స్క్రిప్ట్ రాసిన తర్వాత సీన్స్ గురించి చర్చించేవారు. అయితే ప్రతి సీన్ ఇంకా బాగా రాస్తే బాగుండేది అనుకునేవాడిని.

అదే విషయం ఆయనకు చెప్పడంతో నేను ఉంటే స్క్రిప్ట్ ముందుకు సాగదని తీసేశారు. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఫుట్‌పాత్‌పై ఏకంగా 11 రోజులు పడుకున్నా. ఈ సంగతి తెలిసి మళ్లీ రామ్మోహన్ పిలిచారు. అప్పుడు నాకు 20 ఏళ్లు ఎలాగైనా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయి రైటర్‌గా వర్క్ చేశా. ఆ తర్వాత హీరోగా చాన్స్ వచ్చింది. అప్పటి నుంచి ప్రేక్షకులను అలరిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు.


Similar News